అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య పోరు

అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య పోరు
  • హుజూర్ నగర్ బై పోల్ పై బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి వ్యాఖ్య

హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరాటం అని బీజేపీ రాష్ట్ర నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి అన్నారు. సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలను కొంటూ ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికను చాలెంజింగ్ గా తీసుకుని బీజేపీ కార్యకర్తలంతా పని చేయాలని సూచించారాయన. పార్టీ అభ్యర్థి కోట రామారావును గెలిపించాలన్నారు. హుజుర్ నగర్ లో కార్యకర్తలంతా కలసికట్టుగా పని చేయాలని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల పేరుతో కమీషన్ తీసుకొని కేసీఆర్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని వివేక్ అన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు హుజూర్ నగర్ ఉఫ ఎన్నిక ఒక మంచి అవకాశమని చెప్పారు. కాగా, ఏ దేశానికి గౌరవం ఇవ్వని అమెరికా.. భారత ప్రధాని మోడీకి గొప్ప సన్మానం చేసిందన్నారు.