హుజూర్నగర్లో ఇవాళ జరగాల్సిన TRS ఎన్నికల ప్రచార సభ రద్దైంది. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని..మాట్లాడాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. అంతే కాదు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో హెలీకాప్టర్ లో సభకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ కు అనుమతి ఇవ్వలేదు ఏవియేషన్ శాఖ.
సీఎం కేసీఆర్ సభలో పాల్గొననుండటంతో TRS నాయకులు హుజూర్ నగర్ నుంచి భారీగా జన సమీకరణ చేశారు. అయితే సభా ప్రాంగణంలో భారీగా మేఘాలు కమ్ముకు పోవడంతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నభారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు.