ముషీరాబాద్, వెలుగు: గుట్టుచప్పుడు కాకుండా హైబ్రీడ్ గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్రాల్కు చెందిన రోషన్ సింగ్ ప్రైవేటు ఉద్యోగి. మంగళవారం సికింద్రాబాద్ నామాలగుండు ప్రాంతంలో తన బైక్పై గంజాయిని బ్యాగులో వేసుకుని వెళ్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.39 లక్షల విలువైన 1.311 కిలోల హైబ్రీడ్ గంజాయి (ఓజీ కుష్)తో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న ఇతనిపై గతంలో కార్ఖానా పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నట్లు ఇన్స్పెక్టర్ డి.రామకృష్ణ తెలిపారు.
వికారాబాద్లో 25 కిలోల గంజాయి
వికారాబాద్: ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 25.5 కిలోల గంజాయిని వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని అనకాపల్లికి చెందిన అర్లి గోవింద, కర్రి రమణమ్మ, అర్లి లోవమ్మ కలిసి పల్నాడు ఎక్స్ప్రెస్లో గంజాయిని వికారాబాద్ తీసుకువచ్చారు. అక్కడ రైలు కోసం వేచి చూస్తుండగా పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న 12 బ్యాగుల్లో 25.5 కిలోల గంజాయిని సీజ్ చేశారు.

