బంగాళాఖాతంలో అల్పపీడనం : తెలుగు రాష్ట్రాలకు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం : తెలుగు రాష్ట్రాలకు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నవంబర్ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

మరోవైపు తూర్పుమధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందన్నారు వాతావరణశాఖ అధికారులు. దానికి అనుబంధంగా ఉన్న తుఫాన్ ఆవర్తనం తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని చెప్పారు.

బంగాళాఖాతం ఆగ్నేయం- నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. నవంబర్ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. 

పశ్చిమం- మధ్య బంగాళాఖాతం వైపు అల్పపీడనం క్రమంగా విస్తరిస్తుందని భారత వాతావరణ కేంద్రం చెప్పింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Also Read:- పరేడ్ గ్రౌండ్లో మోదీ సభ