వ్యూహం సినిమాకు మరోదెబ్బ.. OTTలోను నో ఎంట్రీ

వ్యూహం సినిమాకు మరోదెబ్బ.. OTTలోను నో ఎంట్రీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) చేస్తున్న వ్యూహం(Vyooham) సినిమాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ నేత నారా లోకేష్(Nara Lokesh) వేసిన పిటీషన్ కారణంగా.. ఇప్పటికే వాయిదా పడింది. సీబీఎఫ్‌సీ జారీచేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై వ్యూహం సినిమా నిర్మాత కోర్టును ఆశ్రయించారు. దీనిపై నిన్న(జనవరి 12) మరోసారి విచారణ జరిపిన కోర్టు.. మరోమారు వాయిదా వేస్తూ ఈ నెల 22న తీర్పును వెలువరిస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే.. వ్యూహం సినిమాను ఓటీటీ, ఆన్‌లైన్, ఇంటర్నెట్ వంటి మాధ్యమాల్లో కూడా విడుదల చేయవద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. 

ఇక వ్యూహం సినిమా విషయానికి వస్తే.. దివగంత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల ఆధారంగా వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, ఆయన జైలు జీవితం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంట అంశాలు ఈ సినిమాలో కనిపించనున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ అదే విదంగా ఉండటంతో.. ఈ సినిమాపై టీడీపీ పార్టీ నుండి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.