పాత క్వశ్చన్​ పేపర్లతో ప్రాక్టీస్​ చేయండి.. ఎక్కువగా స్లిప్​ టెస్టులు రాస్తే బెటర్

పాత క్వశ్చన్​ పేపర్లతో ప్రాక్టీస్​ చేయండి.. ఎక్కువగా స్లిప్​ టెస్టులు రాస్తే బెటర్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ నల్లగుట్ట(ఓల్డ్) ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్లు ఆడుకోవడానికి స్కూల్ ​పరిసరాల్లో భూమిని చదును చేయాలన్నారు. కిచెన్ ను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. టెన్త్​క్లాస్ రూమ్ కు వెళ్లి స్టూడెంట్లతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పరీక్షలంటే భయపడొద్దని, ప్లాన్​ప్రకారం చదివితే సక్సెస్​సొంతమవుతుందన్నారు. ఐదారేండ్ల క్వశ్చన్ పేపర్లను తీసుకోని ప్రాక్టీస్ చేయాలన్నారు. ఎక్కువగా స్లిప్ టెస్ట్ లు రాయాలన్నారు. విద్యార్థులు పెండ్లిళ్లు , బంధువులు, పండగల కోసం టైం వృథా చేయకుండా చదువుపై ధ్యాస పెట్టాలన్నారు. డిప్యూటీ ఈఓ శ్రీధర్, డిప్యూటీ ఇన్​స్పెక్టర్​ఆఫ్ స్కూల్స్ గుండప్ప, స్వరూప, కృష్ణమూర్తి కలెక్టర్​వెంట ఉన్నారు.