వెపన్స్ డిపాజిట్ చేయండి.. నేతలకు సీపీ ఆనంద్ ఆదేశం

వెపన్స్ డిపాజిట్ చేయండి.. నేతలకు సీపీ ఆనంద్ ఆదేశం

సోమవారం ( అక్టోబర్ 9) తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలచేశారు అధికారులు. నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులు అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రాజకీయ నేతలకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 

తమ దగ్గరున్న వెపన్స్ వెంటనే డిపాజిట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్టోబర్ 16 లోపు దగ్గరలోని పోలీస్ స్టేషన్లలో వెపన్లు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. వెపన్స్ డిపాజిట్ చేయని నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఎన్నికల అయి ఫలితాలు వచ్చాకి డిసెంబర్ 10న తిరిగి తమ వెపన్స్ తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.