- హైదరాబాద్ డీఎంహెచ్ఓ పుట్టా శ్రీనివాస్
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలోని బస్తీ దవాఖానలు, యూపీహెచ్సీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ చూడాల్సిందేనని డీఎంహెచ్ఓ పుట్టా శ్రీనివాస్ ఆదేశించారు.
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఆడిటోరియంలో గురువారం జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానలోని డాక్టర్లతో డీఎంహెచ్వో సమీక్షా సమావేశం నిర్వహించారు. మెడికల్ఆఫీసర్లే ఓపీ రిజిస్టర్ రాయాలన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీధర్, డా.సాయిబాబా, డా. శ్రీకళ పాల్గొన్నారు.
