ఓటరు సంతకం లేకపోతే ఫామ్స్ డిజిటలైజ్ చేయొద్దు: ఎన్నికల అధికారి కర్ణన్ 

ఓటరు సంతకం లేకపోతే ఫామ్స్ డిజిటలైజ్ చేయొద్దు: ఎన్నికల అధికారి కర్ణన్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓటరు సంతకం లేని ఎన్యుమరేషన్ ఫారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ డిజిటలైజ్ చేయవద్దని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ అధికారులకు స్పష్టం చేశారు. 

సర్ ప్రక్రియపై ఈఆర్వోలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ 1100 మందికి పైగా ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవసరమైన చోట పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టాలని సూచించారు. 

అడిషనల్ కమిషనర్ బి.సంతోష్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది, శంషాబాద్ జోనల్ కమిషనర్ కె.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.