అక్కడ బంగారం దాచుకుండు..అయినా దొరికిపోయిండు

అక్కడ బంగారం దాచుకుండు..అయినా దొరికిపోయిండు

తాడి తన్నేవాడుంటే.. వాడి తల తన్నే వాడు కూడా ఉంటాడు. ఈ సామెత శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులకు సరిగా సరిపోతుంది. ప్రయాణికులు ఎంత తెలివిగా అక్రమంగా కొన్ని విలువైన వస్తువులను, బంగారాన్ని విదేశాల నుంచి తీసుకు వచ్చినా..కస్టమ్స్ అధికారులు..సులభంగా కనిపెట్టేస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ఆ ప్రయాణికుడు బంగారాన్ని ఎలా తెచ్చాడో తెలిస్తే షాకవ్వాల్సిందే. 

సెప్టెంబర్ 13వ తేదీన ఓ ప్రయాణికుడు దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాడు. అందరు ప్రయాణికులు నడిచినట్లే ఎయిర్ పోర్టులో నడిచాడు. అయితే కస్టమ్స్ అధికారులను చూసే సరికి అతనికి భయం పుట్టుకుంది. అయినా మేకపోతు గాంభీర్యంతో కస్టమ్స్ అధికారుల దగ్గరకు వచ్చాడు. అతన్ని అధికారులు తనిఖీ చేయగా..విషయం వెలుగులోకి వచ్చాడు. ఆ ప్రయాణికుడు అక్రమంగా దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు కనిపెట్టేశారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. 

Also Read :- కరుడుగట్టిన ఇద్దరు పాత నేరస్తులు అరెస్ట్.. 8 తులాల బంగారం సీజ్

దుబాయ్ నుంచి వచ్చిన ఆ ప్రయాణికుడు నుంచి కస్టమ్స్ అధికారులు 757 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే కస్టమ్స్ అధికారుల కంట పడకుండా ఆ ప్రయాణికుడు బంగారాన్ని పేస్టులా మార్చాడు. ఆ పేస్టును..తన మలద్వారంలో దాచాడు. మలద్వారంలో బంగారం ఉన్నట్లు..స్కానర్లో వెలుగు చూసింది. దీంతో కస్టమ్స్ అధికారులు అవాక్కయ్యారు. పట్టుకున్న 757 గ్రాముల బంగారం విలువ రూ. 46 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మరో ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు 135 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతడు తన ప్యాంటు నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టించిన రహస్య జేబులో బంగారాన్ని దాచినట్లు తెలిపారు.