కరుడుగట్టిన ఇద్దరు పాత నేరస్తులు అరెస్ట్.. 8 తులాల బంగారం సీజ్

కరుడుగట్టిన ఇద్దరు పాత నేరస్తులు అరెస్ట్.. 8 తులాల బంగారం సీజ్

అక్రమ సంపాదనే ధ్యేయంగా గత కొంత కాలంగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి రూ. 9 లక్షల 60 వేల విలువ గల 8 తులాల బంగారం, 36 తులాల వెండి, 4 ద్విచక్ర వాహనాలు, 2 ల్యా్ప్ టాప్ లు, గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. 

Also read :- పుల్లట్లు అంటే డ్రగ్స్.. స్పెషల్ చట్నీ అంటే కొకైన్.. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో డ్రగ్స్ మెనూ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు A1 పందిరి స్వామి(25), A2 రహీమా బేగం(44) లు పలు పోలీస్ స్టేషన్ లలో(దుండిగల్ 07, సూరారం 02, బాచూపల్లి 03, ఐడిఏ బొల్లారం 01) మొత్తం13కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

మరోవైపు పందిరి స్వామిపై నిజామాబాద్ 07, జీడిమెట్ల 04, దుందిగల్ 03 కేసుల్లో జైలుకు వెళ్లాడని.. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు.