బీజేపీ ఉపవాస దీక్ష దగ్గర ఉద్రిక్తత

బీజేపీ ఉపవాస దీక్ష దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్ ఇందిరాపార్క్‌ బీజేపీ చేపట్టిన 24 గంటల ఉప వాస  దీక్ష  శిబిరం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 24 గంటల దీక్ష చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీక్షా సమయం ముగిసిందని..దీక్షా వేదికను ఖాళీ చేయాలన్నారు. దీక్షకు సాయంత్రం6 రు గంటల వరకే పర్మిషన్ ఉందన్నారు పోలీసులు. 

బీజేపీ దీక్షకు పోలీసులు అభ్యంతరాలు చెబుతుండగా.. ..సెప్టెంబర్ 14వ తేదీ తెల్లవారు దాకా దీక్ష చేసి తీరతానని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల కిషన్ రెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేశారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి తనను లిఫ్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. 

Also Read :- ప్లాన్ ప్రకారమే నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ అన్యాయం: కిషన్ రెడ్డి

బీజేపీ 24 గంటల ఉపవాస దీక్షా శిబిరం దగ్గర ఉన్న కార్యకర్తలను ఖాళీ చేస్తున్నారు పోలీసులు. అయితే కొందరు కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అటు కిషన్ రెడ్డి కూడా పట్టువీడకపోవడంతో..ఆయన్ను అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి..రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తన దీక్ష కొనసాగుతుందని చెప్పారు.