హైదరాబాద్, వెలుగు: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో వరుసగా ఐదో మ్యాచ్లో గెలిచిన హైదరాబాద్ సెమీఫైనల్ చేరుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం, మూడో రోజు ముగిసిన చివరి లీగ్ పోరులో హైదరాబాద్ ఇన్నింగ్స్ 73 రన్స్ తేడాతో మిజోరంను చిత్తు చేసింది. ఓవర్నైట్ స్కోరు458/8తో ఆట కొనసాగించిన హైదరాబాద్ 465/9 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
దాంతో 266 రన్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన మిజోరం 193 రన్స్కే ఆలౌటై చిత్తుగా ఓడింది. కెప్టెన్ రాల్టె (40) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ ఐదు, రోహిత్ రాయుడు రెండు వికెట్లు తీశారు. ఈ నెల 9 నుంచి జరిగే సెమీస్లో నాగాలాండ్తో పోటీ పడుతుంది.