హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంపు.. గరిష్ట టికెట్ ధర రూ. 70

హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంపు.. గరిష్ట టికెట్ ధర రూ. 70

మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది మెట్రో రైల్ సంస్థ.  మెట్రో టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు మే  17 నుంచి అమలు కానున్నాయని తెలిపింది.  ప్రస్తుత కనిష్ట  ధర రూ., 10 ఉండగా ఇపుడు రూ.12కు పెంచారు అధికారులు.ప్రస్తుత గరిష్ట టికెట్ ధరను రూ.60  ఉండగా..ఇపుడు రూ.75కి పెంచారు.

పెంచిన ధరలు ఇలా ఉన్నాయి.

  •  2  కిలోమీటర్ల వరకు రూ.12 రూపాయలు
  • 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు
  • 6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు
  • 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు
  • 12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు
  • 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు
  • 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు 
  • 24  కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం.