- సీఎంకు క్లబ్ అధ్యక్షుడు విజయ్కుమార్ రెడ్డి వినతి
పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్ స్థలం లీజును 99 ఏండ్ల పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రెస్క్లబ్ అధ్యక్షుడు విజయ్కుమార్ రెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీలోని ఆఫీసులో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రికి ఆయన వినతిపత్రం అందజేశారు. ప్రెస్క్లబ్ నిర్వహించే సామాజిక బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని నామమాత్రపు ధరకు స్థలాన్ని శాశ్వతంగా కేటాయించాలని కోరారు.
ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని విజయ్కుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సత్వరమే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. విజయ్ కుమార్ రెడ్డి వెంట ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి వి.రమేశ్, తదితరులు ఉన్నారు.
