హైదరాబాద్: తెలంగాణలో గిగ్ వర్కర్లు మరోసారి సమ్మె బాట పడుతున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఆగస్ట్ 8 నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు గిగ్, ప్లాట్ఫామ్ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం, ప్లాట్ఫామ్ కంపెనీలతో నెలల తరబడి చర్చలు జరిపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం (TADF), తెలంగాణ గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల యూనియన్ (TGPWU) సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో.. ఆగస్ట్ 8 నుంచి తెలంగాణ వ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఉబర్, ఓలా సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది.
