యాసిడ్ తాగి యువకుడు సూసైడ్..జీడిమెట్లలో నివాసం.. సెక్యూరిటీ గార్డ్ జాబ్

యాసిడ్ తాగి యువకుడు సూసైడ్..జీడిమెట్లలో నివాసం.. సెక్యూరిటీ గార్డ్ జాబ్

జీడిమెట్ల, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. బిహార్​కు చెందిన జాన్​ అమృత్(26) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జీడిమెట్లలో నివాసముంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతడు కావ్వ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్య డెలివరీ కోసం బిహార్​లోని పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 14న మద్యం మత్తులో యాసిడ్​ తాగాడు. సెల్ఫీ వీడియో తీసి భార్యకు పంపించాడు. ఆమె బంధువులను అతని ఇంటికి పంపింది. వారు ఉస్మానియా దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.