పెండింగ్ చలాన్ కట్టమన్నందుకు బైక్కే నిప్పు పెట్టాడు ఓ యువకుడు. ఈ ఘటన శంషాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఆ వివరాలు.. సోమవారం మధ్యాహ్న సమయంలో శంషాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. అటుగా వస్తున్న ఫసియుద్దీన్ అనే యువకుడి బైక్ను ఆపారు. ఆ వాహనంపై అప్పటికే పెండింగ్ చలాన్లు ఉండడంతో.. వాటిని కట్టాలని అతనికి సూచించారు.
తన దగ్గర డబ్బులు లేవని తర్వాత కడతానని యువకుడు చెప్పగా.. పోలీసులు అందుకు అంగీకరించలేదు. కట్టిన తరువాతనే బండి తిరిగిస్తామని చెప్పారు.దీంతో.. యువకుడికి ట్రాఫిక్ పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు యువకుడు..వెంటనే తన యాక్టివా డిక్కీ తెరిచి బైక్కు నిప్పంటించాడు. అయితే.. వెంటనే పోలీసులు స్పందించి.. మంటలు ఆర్పేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగుడంతో అక్కడున్న తోటి వాహనదారులు భయంతో పరుగులు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెండింగ్ చలాన్ కట్టమన్నందుకు బైక్కు నిప్పు పెట్టిన ఘనుడు
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2023
శంషాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ఆపి పెండింగ్ చాలన్ కట్టాలని చెప్పడంతో వాగ్వాదానికి దిగిన ఫసియుద్దీన్ అనే యువకుడు. ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడి తన యాక్టివా బండికి నిప్పు పెట్టిన యువకుడు. pic.twitter.com/li3b9lhGEk