శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో.. లగేజ్ చెక్ చేస్తుంటే ఈ అమ్మాయి బ్యాగ్లో..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో.. లగేజ్ చెక్ చేస్తుంటే ఈ అమ్మాయి బ్యాగ్లో..

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో 12 కోట్ల రూపాయలు విలువ చేసే హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వచ్చిన ప్రయాణిరాలి లగేజీ బ్యాగేజ్లో ఈ గంజాయిని అధికారులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై డిఆర్ఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 13.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని ఆగస్ట్లో కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.13.3 కోట్లు ఉంటుందని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌‌‌‌ఐ) అధికారులు వెల్లడించారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో సోదాలు చేశామని తెలిపారు.

ALSO READ : H-1B వీసాపై 2017లోనే రాహుల్ గాంధీ హెచ్చరిక..

ఓ మహిళా ప్యాసింజర్ చెక్-ఇన్ బ్యాగేజీని సెర్చ్ చేయగా..అందులో 20 ప్యాకెట్లలో హైడ్రోపోనిక్ గంజాయి దొరికిందని వివరించారు. మొత్తం 13.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. నిందితురాలిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌‌‌‌స్టాన్సెస్ (ఎన్‌‌‌‌డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశామన్నారు. ఆమెను కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌‌‌‌కు తరలించారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల వ్యవధిలోనే మరో యువతి ఈ హైడ్రోపోనిక్ గంజాయి తరలిస్తూ పట్టుబడటంతో హైదరాబాద్‌‌‌‌లో ఈ గంజాయి రిసీవర్ ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.