హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసీయా) 33వ వార్షిక సదస్సు హైదరాబాద్లో గురువారం జరిగింది. ఏఐ, ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ల ప్రాధాన్యత గురించి సుమారు 1,200 మంది నిపుణులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు మాట్లాడారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్టీపీఐ హైదరాబాద్తో కలిసి తెలంగాణ ఐటీ శాఖ నిర్వహించింది. ఎగుమతులు, వ్యాపార వృద్ధి, ఉపాధి కల్పన, మహిళా శ్రామిక శక్తి పెంపులో రాణించిన సంస్థలకు ఈ సందర్భంగా అవార్డులు ఇచ్చారు. ఏఐ మాస్టర్ క్లాసులు, స్టార్టప్ ఎక్స్ పో ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 40 ఉత్తమ స్టార్టప్ ఉత్పత్తులకు అవార్డులు అందజేశారు.
