పదవీ విరమణ సందర్భంగా రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉపరాష్ట్రపతి అవ్వాలని ఎప్పుడు కోరుకోలేదన్నారు. పార్టీ ఆదేశించింది కాబట్టే పదవీ చేపట్టినట్లు చెప్పారు. పార్టీకి రాజీనామా చేసిన రోజు కన్నీళ్లు వచ్చాయని భావోద్వేేగానికి లోనయ్యారు. ఎగువ సభకు చాలా బాధ్యత ఉందని..సభా గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని వెంకయ్య సూచించారు.
ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. సభ నిర్వహణకు తన వంతు కృషి చేశానని చెప్పారు. దేశంలో అన్ని పార్టీలకు సభలో ప్రాధాన్యం ఇచ్చామని..పార్లమెంట్ సజావుగా సాగాలనేదే తన కోరికని..సభ్యుల ప్రేమ, ఆప్యాయతలను తానెప్పుడూ మర్చిపోలేనని స్పష్టం చేశారు.
The day PM told me that I was being selected to become the Vice President of India, I was in tears, I didn't ask for it. Party had given the mandate, I obliged & resigned from the party. Tears were because I had to leave the party: Outgoing RS Chairman & VP M Venkaiah Naidu pic.twitter.com/BrG90W8AUk
— ANI (@ANI) August 8, 2022