ముంబై: ప్రముఖ నటుడు సోనూ సూద్పై ఐటీ రైడ్స్ మూడు రోజులుగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 15కన మొదట ముంబైలోని ఆయన ఇంట్లో , మరో ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. తర్వాతి రోజు (సెప్టెంబర్ 16) ఉదయం మళ్లీ సోనూ ఇంటికి ఐటీ అధికారుల చేరుకుని రైడ్స్ కొనసాగించారు. ఇక ఇవాళ కూడా ముంబైలోని ఇంట్లో, నాగ్పూర్, జైపూర్లలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సోనూ సూద్ ప్రాపర్టీస్పై రైడ్స్కు దిగారు. సోనూ సూద్ ఆదాయ మార్గాలేంటి? వేటిపై, ఎలా ఖర్చు చేస్తున్నారు? అన్న వివరాలపై అన్ని ఫైనాన్సియల్ రికార్డ్స్ను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.
కరోనా సమయంలో సేవ చేసి రియల్ హీరోగా ప్రశంసలు అందుకున్న సోనూ సూద్ ఇంటిపై నిన్న రెండో రోజు ఐటీ రైడ్స్ మొదలవగానే ఆయన ఫ్యాన్స్ ట్విట్టర్లో ‘‘#IstandWithSonuSood” అనే హ్యాష్ ట్యాగ్తో ట్రెండింగ్ చేశారు. మరోవైపు సోనూపై ఐటీ దాడులను రాజకీయ పార్టీలు కూడా తప్పుబడుతున్నాయి. కరోనా కష్ట సమయంలో లక్షలాది మందికి సోనూ సూద్ సాయం చేశారని, ఆయన అక్రమాలు చేసి ఉంటారని తాను భావించడం లేదని శివసేన లీడర్ ఆనంద్ దూబే అన్నారు.