కశ్మీర్‌లో కూలిన విమానం..ఇద్దరు పైలట్లు మృతి

కశ్మీర్‌లో కూలిన విమానం..ఇద్దరు పైలట్లు మృతి

జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో యుద్ధవిమానం కూలిపోయింది. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన మిగ్‌-21 యుద్ధవిమానం బుధ‌వారం ఉద‌యం కుప్పకూలిపోయింది. జమ్ము కశ్మీర్ బుద్గాం జిల్లాలోని గారెండ్ కలాన్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. టెక్నికల్ ప్రాబ్లమ్ తోనే ఫైటర్ జెట్ క్రాష్ అయిందని తెలిపారు అధికారులు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించారు. వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ ఎయిర్‌ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే ఈ ప్ర‌మాదం జ‌రిగింది. విమానం కూలిన ఘ‌ట‌న‌పై ఇండియ‌న్ ఎయిర్‌ ఫోర్స్ ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది.