- హిమాన్షు కామెంట్లపై ఆకునూరి మురళి ట్వీట్
హైదరాబాద్, వెలుగు: కేశవ్నగర్ సర్కారు బడిని చూసి తనకు కన్నీళ్లొచ్చాయని సీఎం కేసీఆర్ మనుమడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు చేసిన కామెంట్లపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్పందించారు.
‘‘ధన్యవాదాలు హిమాన్షు రావు. ఇన్నేండ్లుగా మేమందరం చెప్తున్న విషయాలను నువ్వు సహజ ఉద్వేగంతో చెప్పావు. ఇంకో మాట కూడా మీ తాతకు చెప్పు ప్లీజ్.. మీ తాతను గుడులతో పాటు బడులను కూడా సందర్శించాలని చెప్పు. నువ్వు ఒక్క బడికి చేసినట్టే రాష్ట్రంలోని 26 వేల బడులకూ చేయాలని మీ తాతకు చెప్పు” గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు.