కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడారం జాతర కు జాతీయ హోదా కల్పించే విధంగా చొరవ తీసుకుంటామన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క, పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. ఇవాళ (బుధవారం) మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు సీతక్క, అద్దంకి దయాకర్. ఆ తర్వాత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని తల్లులను వేడుకున్నామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు. మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నా.. ఇంకా జాతర పనులు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పనులు సకాలం లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని.. జాతర పనుల్లో అవకతవకలు జరిగితే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేసి వెళ్తాం అంటే కుదరదని.. నాణ్యత ప్రమాణాలు పాటించి పని చేయాలని హెచ్చరించారు.
మరిన్ని వార్తల కోసం..