అలా చేస్తే గంగపుత్రులకు అన్యాయం జరగదు : జీవన్ రెడ్డి

అలా చేస్తే గంగపుత్రులకు అన్యాయం జరగదు : జీవన్ రెడ్డి

కులగణన చేసి ముదిరాజ్‌లను బీసీఏలో కలిపి రిజర్వేషన్‌ శాతం పెంచితే గంగపుత్రులకు అన్యాయం జరగదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. బీసీ కుల గణన చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కుల గణన చేసి 50 శాతం ఉన్న బీసీలకు 40 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేవలం రూ.30 కోట్లు కేటాయిస్తే బీసీ కులగణన పూర్తి చేయవచ్చన్నారు. అన్ని వర్గాల సమ న్యాయం కోసం గణన చేపట్టినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ తో రాజకీయంగా కలిసి పని చేశానన్న జీవన్ రెడ్డి... ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో రాష్ట్రానికి సేవలందించాలని ఆకాంక్షించారు.