బ్యాంకులు ఇబ్బందుల్లో పడితే డిపాజిటర్లకు రూ. 5 లక్షలు

బ్యాంకులు ఇబ్బందుల్లో పడితే డిపాజిటర్లకు రూ. 5 లక్షలు
  • బ్యాంకులు ఇబ్బందుల్లో పడితే.. డిపాజిటర్లకు రూ. 5 లక్షల తక్షణ రిలీఫ్​
  • డీఐసీజీసీ సవరణ బిల్లుకు కేబినెట్​ ఓకే

న్యూఢిల్లీ: డిపాజిట్​ ఇన్సూరెన్స్​ అండ్​ క్రెడిట్​ గ్యారంటీ కార్పొరేషన్​ (డీఐసీజీసీ) చట్ట సవరణకు కేంద్ర కేబినెట్​ బుధవారం ఆమోదం తెలిపింది. బ్యాంకులు ఇబ్బందులపాలైనప్పుడు డిపాజిటర్లకు రూ. 5 లక్షల మొత్తాన్ని అందించేందుకు ఈ సవరణను ప్రతిపాదించారు. బ్యాంకులు మారటోరియం కిందకు వచ్చిన 90 రోజుల లోపు ఈ రూ. 5 లక్షల మొత్తాన్ని డిపాజిటర్లు  వెనక్కి తీసుకునే వెసులుబాటు దీని వల్ల కలుగుతుంది. కిందటేడాది పీఎంసీ బ్యాంకు సమస్యలలో పడినప్పుడు డిపాజిట్లపై ఇన్సూరెన్స్​ను రూ. 5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. డిపాజిటర్లను కాపాడేందుకే ఈ చర్య తీసుకున్నారు. పీఎంసీ బ్యాంకు తర్వాత యెస్​ బ్యాంకు, లక్ష్మీ విలాస్​ బ్యాంకులు కూడా ఇబ్బందులలో పడటంతో వాటిపైనా మారటోరియం విధించిన విషయం తెలిసిందే. డీఐసీజీసీ చట్టానికి సవరణ తేనున్నట్లు ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ బడ్జెట్​లోనే ప్రకటించారు.  ఈ సవరణ బిల్లును పార్లమెంట్​ మాన్సూన్​ సెషన్​లో తేనున్నామని నిర్మలా సీతారామన్​ బుధవారం కేబినెట్​ మీటింగ్​ తర్వాత మీడియాకు వెల్లడించారు.  బిల్లు పార్లమెంట్​ ఆమోదం పొందితే బ్యాంకులు కష్టాలపాలైనా, డిపాజిటర్లకు తక్షణ రిలీఫ్​ దొరుకుతుంది.