
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషన్ నాలెడ్జ్ మిలినియం కాన్ఫరెన్స్ 17 వ ఎడిషన్ను సోమవారం, మంగళవారం ఐకేపీ నాలెడ్జ్ పార్క్ (ఐకేపీ) నిర్వహిస్తోంది. క్లైయిమేట్ చేంజ్, సప్టయినబిలిటీ అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో ఫోకస్ పెట్టింది. బిరాక్ ఎండీ జితేంద్ర కూమార్, ఐఐటీ హైదరాబాద్ మాజీ డైరెక్టర్ ఉదయ్ దేశయ్ కాన్ఫరెన్స్ మొదటి రోజును స్టార్టప్ ఎగ్జిబిషన్ను ఓపెన్ చేయడం ద్వారా ప్రారంభించారు.
ఈ ఈవెంట్లో మెడికల్ డివైజ్లు, డిజిటల్ హెల్త్, ఇండస్ట్రియల్ బయోటెక్, బయో ఫార్మా , అగ్రీ టెక్ వంటి వివిధ సెక్టార్లకు చెందిన స్టార్టప్లు పాల్గొన్నాయి. గ్రీన్ ఎనర్జీ వైపు ఇండియా మరలుతోందని, జెట్ జీరో టార్గెట్ను చేరుకోవడానికి కీలకమైన దశలో ఉన్నామని ఓపెనింగ్ సెషన్లో రిలయన్స్ బీపీ మొబిలిటీ సీఎఫ్ఓ వినోద్ తహిలియాని అన్నారు. కాగా, ఇండియా గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈవీల వాడకాన్ని ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది.