Sabarimala temple:అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెరుచుకున్నశబరిమల ఆలయం

Sabarimala temple:అయ్యప్ప భక్తులకు శుభవార్త..  తెరుచుకున్నశబరిమల ఆలయం

భక్తుల దర్శనం కోసం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఆదివారం(జూన్14) సాయంత్రం 5గంటలకు గర్భగుడిని తెరిచి లాంఛనంగా దీపం వెలిగించి పూజలు ప్రారంభించారు. మిథున మాస పూజల కోసం ఆలయం ఐదురోజుల పాటు తెరిచి ఉంటుంది. అనంతరం జూన్ 19న ఆలయాన్ని మూసివేయనున్నారు. భక్తులు శబరిమల ఆన్‌లైన్ పోర్టల్‌ www.sabarimalaonline.org లో వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా తమ దర్శన స్లాట్‌లను బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. 

మరోవైపు శబరిమల బంగారం చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) జరుపుతున్న విచారణలో భాగంగా శబరిమల సన్నిధానం ఆలయంలోని ప్రభమండలం ,కట్టిలప్పాడి దిగువ భాగంలో బంగారు పూత పూసిన పలకలను తొలగించారు.