
పోచారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా దూకుడు పెంచింది. ఇటీవల దివ్యానగర్ లో భారీ ప్రహరీ నిర్మాణాన్ని కూల్చివేశారు. కాగా సోమవారం ( జూన్ 23)ఉదయం కొర్రెముల ఏకశిలా నగర్ లో సర్వే నెంబర్739 నుంచి 749 మధ్య ఉన్న 7.16 ఎకరాల భూమి చుట్టూ అనుమతి లేకుండా నిర్మించిన ప్రహరీ గోడను కూల్చి వేశారు. ఏకశిలా వెంచర్లో తప్పుడు పత్రాలు సృష్టించి వ్యవసాయ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని, తమకు న్యాయం చేయాలంటూ ఏకశిల ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు హైడ్రా కమిషనర్ ను కోరారు. అయితే ఐదు రోజులుగా హైడ్రా అధికారులు గత ఐదు రోజుల క్రితం ఏకశిలా నగర్ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు..