
చందానగర్, వెలుగు : తక్కువ ధరకు డిఫెన్స్ మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి బయటి వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద రూ.5 లక్షల విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం చందానగర్లోని శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీపీ కిషన్ కేసు వివరాలను వెల్లడించారు.
మియాపూర్ మాతృశ్రీనగర్ శ్రీసాయి రెసిడెన్సీలో ఉంటున్న మన్నవ గాంధీ(65) తెలిసిన వ్యక్తుల ద్వారా డిఫెన్స్ మద్యం బాటిళ్లను తక్కువ ధరకు భారీ మొత్తంలో కొన్నాడు. ఓ రేకుల షెడ్రెంటుకు తీసుకుని స్టోర్ చేశాడు. బయటి వ్యక్తులకు వాటిని ఎక్కువ ధరకు అమ్ముతన్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తెలిసింది. శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించి వివిధ బ్రాండ్లకు చెందిన 160 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వాస్కోడిగామా రైల్లో లిక్కర్ సీజ్
హైదరాబాద్ సిటీ: వాస్కోడిగామా రైలులో శుక్రవారం ఎక్సైజ్శాఖ తనిఖీలు నిర్వహించి 48 నాన్డ్యూటీ లిక్కర్బాటిళ్లను పట్టుకుంది. గోవా నుంచి ఈ రైలు వస్తుండగా షాద్నగర్ లో రైలెక్కిన ఎస్టీఎఫ్, డీటీఎఫ్టీమ్స్కాచిగూడ వరకు తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 48 బాటిల్స్ పట్టుకుని సీజ్చేశారు. ఎస్టీఎఫ్బి, సి, డి, సీఐలు బిక్షారెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు, సికింద్రాబాద్ డీటీఎఫ్సీఐ, 35 మంది సిబ్బంది పాల్గొన్నారు.