చందానగర్​లో ఇల్లీగల్​గా డిఫెన్స్​ లిక్కర్​ అమ్మకాలు..రూ.5 లక్షల విలువైన మద్యం స్వాధీనం

చందానగర్​లో ఇల్లీగల్​గా డిఫెన్స్​ లిక్కర్​ అమ్మకాలు..రూ.5 లక్షల విలువైన మద్యం స్వాధీనం

చందానగర్​, వెలుగు : తక్కువ ధరకు డిఫెన్స్ మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి బయటి వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని రంగారెడ్డి ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు అరెస్ట్​ చేశారు. అతడి వద్ద రూ.5 లక్షల విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన లిక్కర్​ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం చందానగర్​లోని శేరిలింగంపల్లి ఎక్సైజ్​ పోలీస్​ స్టేషన్​లో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ ఏసీపీ కిషన్​ కేసు వివరాలను వెల్లడించారు.

మియాపూర్​ మాతృశ్రీనగర్​ శ్రీసాయి రెసిడెన్సీలో ఉంటున్న మన్నవ గాంధీ(65) తెలిసిన వ్యక్తుల ద్వారా డిఫెన్స్​ మద్యం బాటిళ్లను తక్కువ ధరకు భారీ మొత్తంలో  కొన్నాడు. ఓ రేకుల షెడ్​రెంటుకు తీసుకుని స్టోర్​ చేశాడు. బయటి వ్యక్తులకు వాటిని ఎక్కువ ధరకు అమ్ముతన్నట్లు ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులకు తెలిసింది. శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించి వివిధ బ్రాండ్లకు చెందిన 160 లిక్కర్​ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

వాస్కోడిగామా రైల్లో లిక్కర్​ సీజ్​

హైదరాబాద్​ సిటీ: వాస్కోడిగామా రైలులో శుక్రవారం ఎక్సైజ్​శాఖ తనిఖీలు నిర్వహించి 48 నాన్​డ్యూటీ లిక్కర్​బాటిళ్లను పట్టుకుంది. గోవా నుంచి ఈ రైలు వస్తుండగా షాద్​నగర్ లో రైలెక్కిన ఎస్టీఎఫ్, డీటీఎఫ్​టీమ్స్​కాచిగూడ వరకు తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 48 బాటిల్స్ పట్టుకుని సీజ్​చేశారు. ఎస్టీఎఫ్​బి, సి, డి, సీఐలు బిక్షారెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు, సికింద్రాబాద్ డీటీఎఫ్​సీఐ, 35 మంది సిబ్బంది పాల్గొన్నారు.