దేవుడు మొర విన్నాడు.. బెంగాల్‌‌లో మాదే గెలుపు

దేవుడు మొర  విన్నాడు.. బెంగాల్‌‌లో మాదే గెలుపు

జయ్ నగర్: బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ ముమ్మరం చేశారు. సీఎం మమతా బెనర్జీపై ఆయన విమర్శల బాణాలను సంధించారు. దీదీ గడ్డ మీద 200 సీట్లు గెలిచి, పవర్ లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను సీజనల్ భక్తుడిని కాదన్నారు. 'మేం 200 పైచిలుకు సీట్లు గెలుస్తామని ప్రజలు అన్నారు. తొలి దశ ఎన్నికల్లోనే జనాల మొర దేవుడు విన్నట్లున్నాడు. మేమే అధికారంలోకి రాబోతున్నాం. బంగ్లాదేశ్ పర్యటనలో జేషోరేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించా. కానీ నేను గుళ్ళు, గోపురాలను దర్శిస్తే మమతా బెనర్జీకి కోపం వస్తోంది? ఆమెకు జైశ్రీరామ్ నినాదమన్నా ఆగ్రహమే. ఓడిపోతామన్న భయంతో ఈవీఎం, ఎన్నికల కమీషన్ ను దీదీ తిడుతున్నారు. ఇది సరికాదు' అని మోడీ పేర్కొన్నారు.