దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజే వేరు. ఇతర క్రీడలకంటే క్రికెట్ను అభిమానించే వారే ఎక్కువ అందుకే భారత్లో క్రికెట్ను ఓ మతంగా భావిస్తారు. ఎంతో మంది టాలెంట్ ఉన్న క్రికెటర్లు మన సొంతం. అయితే గతంలో మెన్స్ క్రికెట్ కే క్రేజ్ ఉండగా..ఈ మధ్య కాలంలో మహిళల క్రికెట్ మ్యాచులకు ఆదరణ పెరుగుతోంది. ఇందుకు మారుమూల గ్రామంలో యువతి క్రికెట్ ఆడుతున్న వీడియో ఉదాహరణగా నిలుస్తోంది.
పర్ఫెక్ట్ టైమింగ్తో బ్యాటింగ్
రాజస్థాన్లో ఓ యువతి ధనాధన్ షాట్లతో చేలరేగిపోయింది. ఓ సాధారణ యువతి అద్భుతమైన షాట్లు ఆడుతూ సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేస్తోంది. బ్యాటింగ్ చేస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రతి బంతినీ సరైన టైమింగ్తో సిక్సర్లుగా మలుస్తున్న తీరు అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం ఆ యువతి బ్యాటింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
షేర్ చేసిన సచిన్
యువతి అసాధారణ బ్యాటింగ్ వీడియోను సచిన్ టెండూల్కర్ ఫిదా అయ్యారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వీడియోను షేర్ చేశాడు. క్యా బాత్ హై. నీ బ్యాటింగ్ను బాగా ఎంజాయ్ చేశాను..అని క్యాప్షన్ ఇచ్చారు. సచిన్ తో పాటు..బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ఈ వీడియోను ట్వీట్ చేయడం విశేషం.