తుపాకులు వీడండి.. కలసి పని చేద్దాం

తుపాకులు వీడండి.. కలసి పని చేద్దాం

తమల్పూర్: దేశ శ్రేయస్సు కోసం హింసా బాటను వీడి కలసి రావాలని మిలిటెంట్లను ప్రధాని మోడీ కోరారు. అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మిలిటెంట్లను గన్స్ వీడి కలసి పని చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. శాంతియుత, ఆత్మనిర్భర అస్సాం స్థాపనలో భాగం కావాలని పిలుపునిచ్చారు. 'మీ బిడ్డలు తుపాకులతో తిరగాల్సిన అవసరం లేదు. అడవుల్లో వాళ్లు చనిపోవడానికి వీల్లేదు. ఎవరి బుల్లెట్లకూ వారు తమ ప్రాణాలు కోల్పోకుండా మేం చూస్తాం. ఇదే ఎన్డీయే హామీ' అని ప్రచారంలో మోడీ చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిని చిత్తుగా ఒడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.