
ఈ నెల 16 నుంచి తిరుమల శ్రీవారి దసరా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేటెస్టుగా జారీ చేసిన కరోనా మార్గదర్శకాల క్రమంలో ఈసారి కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు నిర్ణయించింది.
ఇటీవల ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించారు ఆలయాధికారులు. అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. అయితే.. భక్తులను అనుమతించాలని మొదట నిర్ణయించినా, కరోనా వ్యాప్తి క్రమంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. భక్తుల నడుమ స్వామివారి దసరా బ్రహ్మోత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు కూడా చేసినా… భక్తుల ఆరోగ్యరీత్యా ఏకాంతంగానే ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.