
వేడిగాలులు వేధిస్తున్నాయి.. ఓ పక్క అధిక ఉష్ణోగ్రత.. మరోపక్క కరంట్ కోతలు యూపీ ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. దీంతో ఓ కుటుంబం ఏకంగా ఏటీఎంను నివాసంగా మార్చుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ఝూన్సీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఉత్తరప్రదేశ్లో కరెంట్ కోతలతో ప్రజలు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం ఏకంగా ఏటీఎంను ఇల్లుగా మార్చుకుంది. పిల్లలతో కలిసి రాత్రివేళ అక్కడ నిద్రిస్తున్నారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
ఝాన్సీలో నిరంతర విద్యుత్ కోతలపై ప్రజలు మండిపడుతున్నారు. కరెంట్ కోతలకు వ్యతిరేకంగా నిరసనలు, నిరాహార దీక్షలు, రోడ్డు దిగ్బంధం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్ కోతలతో ఒక కుటుంబం విసిగిపోయింది. మహిళలు, పిల్లలు రాత్రివేళ ఏటీఎంలలో నిద్రిస్తున్నారు.
In UP's Jhansi, locals struggling with massive power cuts for the past month have now sought refuge at an ATM. pic.twitter.com/hszYyc67pN
— Piyush Rai (@Benarasiyaa) May 20, 2025
ఝూన్సీలో కరంట్ కోతల విషయంలో .. తమ పరిస్థితి గురించి ఒక మహిళ వాపోయింది. తమ ప్రాంతం గత నెల రోజులుగా విద్యుత్ కోతలను ఎదుర్కొంటోందని తెలిపింది. కంటిన్యూగా ఏటీఎంలో విద్యుత్ సరఫరా ఉంటుందని.. ఏసీ కూడా ఉంటుందని చెప్పింది. దీంతో తమ కుటుంబం మొత్తం ఇక్కడకు వచ్చామని ఆమె తెలిపింది. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే తామంతా రోడ్డుపైనే పడుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది.
A woman resting with her family in the ATM claims they have reeling under massive power cuts for the past month. pic.twitter.com/oRTrAmq3vA
— Piyush Rai (@Benarasiyaa) May 20, 2025
ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దీనిని ఎక్స్లో షేర్ చేశారు. సీఎం ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు విద్యుత్ శాఖపై ఆయన మండిపడ్డారు.
बिजली कटौती के मारे
— Akhilesh Yadav (@yadavakhilesh) May 21, 2025
एटीएम जा पहुँचे बेचारे
उप्र बिजली विभाग, जिसकी ख़ुद की बत्ती गुल है।
कोई है? pic.twitter.com/uHufVHJItN