కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగానే పెట్రోల్ పోసి దహనం

కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగానే పెట్రోల్ పోసి దహనం

విజయవాడలో దారుణ ఘటన జరిగింది. నగరంలోని నోవాటెల్ హోటల్ దగ్గర ఓ కారును పెట్రోల్ పోసి దహనం చేశారు.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణారెడ్డి, గంగాధర్‌, నాగమల్లి, వేణుగోపాల్‌రెడ్డి అనే నలుగురు వ్యక్తులు కారులో కూర్చుని ల్యాండ్‌ విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం తలెత్తడంతో వేణుగోపాల్‌ రెడ్డి చర్చల మధ్యలోనే కారు నుంచి దిగిపోయాడు. వెంటనే డోర్లన్నీ లాక్‌ చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించి.. అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న డీసీపీ హర్షవర్ధన్‌ రాజు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రియల్ ఎస్టేట్ వివాదాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు పోలీసులు.