మహాకాల్ కారిడార్ ప్రారంభోత్సవాన్ని తిలకించిన బండి సంజయ్

మహాకాల్ కారిడార్ ప్రారంభోత్సవాన్ని తిలకించిన బండి సంజయ్

దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు ప్రధాని మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్ ప్రారంభోత్సవాన్ని నల్లకుంటలోని శంకరమఠంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ లో ఆయన తిలకించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్ను మోడీ ప్రారంభించడం గర్వించదగ్గ విషయమన్నారు.  

దేశ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా ప్రధాని మోడీ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని బండి సంజయ్ అన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణంకు అన్ని అడ్డంకులను తొలగించి భూమి పూజ చేసిన గొప్ప నేత మోడీ అని కొనియాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చార్ధమ్ యాత్రకు సులభంగా వెళ్ళి వచ్చేలా అనేక చర్యలు చేపట్టారన్నారు. మోడీ పాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.