హర్యానాలోని ఓ గనిలో ప్రమాదం

హర్యానాలోని ఓ గనిలో ప్రమాదం

హర్యానాలోని ఓ గనిలో ప్రమాదం జరిగింది. భివానీ జిల్లాలోని డడమ్ మైనింగ్ జోన్ లోని టోషామ్ బ్లాక్ లో మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. మైనింగ్ కోసం వెళ్లిన వాహనాలపై కొంచరియలు పడిపోయాయి. శిథిలాల నుంచి 15-20 మంది చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. హర్యానా వ్యవసాయ శాఖా మంత్రి JP దలాల్ స్పాట్ ను పరిశీలించారు. కొందరు చనిపోయారని... అయితే ఎంతమంది చనిపోయారనేది చెప్పలేమన్నారు. వీలైనంత ఎక్కువ మందిని సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. డాక్టర్స్ టీమ్ ను కూడా స్పాట్ కు పిలిపించారు. శిథిలాల నుంచి బయటకు తీసినవారికి అక్కడే ట్రీట్ మెంట్ అందించేలా ఏర్పాట్లు చేశారు. ఆంబులెన్స్ లను కూడా సిద్ధంగా ఉంచారు. ల్యాండ్ స్లైడ్ ఘటన బాధ కలిగించిందన్నారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్. లోకల్ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడానని... రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని ట్వీట్ చేశారు.