- పోక్సో కేసు నమోదు
- మేడిపల్లి పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
మేడిపల్లి, వెలుగు : మైనర్పై అత్యాచార ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ఓ బాలిక(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం ఆమె స్కూల్కు వెళ్తుండగా.. సురేశ్ అలియాస్ లడ్డు(26), బాలారాజు అలియాస్ చిట్టి(24) అనే ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి సాయంత్రం బాలికను విడిచిపెట్టారు.
బాలిక అనారోగ్యంతో ఇంటికి రావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఏమైందని అడగగా.. జరిగిన విషయం చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు మేడిపల్లి పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు ఇద్దరు యువకులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి రిమాండ్కు తరలించారు.