ఆర్టీసీ ఉద్యోగులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పెంపు

ఆర్టీసీ ఉద్యోగులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పెంపు
  • యూనియన్ బ్యాంక్ తో ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థ

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పెరిగింది. అందుకు సంబంధించి యూనియన్ బ్యాంక్ తో ఆర్టీసీ ఎంవోయూ కుదుర్చుకుంది.  ప్రమాద బీమా  రూ.40 లక్షల నుంచి రూ. 1 కోటికి పెరిగింది. శనివారం బస్ భవన్ లో యూనియన్ బ్యాంక్  సీజీఎం, జోనల్ హెడ్ భాస్కర్ రావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎంవోయూ పత్రాలు మార్చుకున్నారు.

 యూబీఐ సూప‌‌ర్ శాల‌‌రీ సేవింగ్ అకౌంట్(యూఎస్ఎస్ఏ) కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనుందని చెప్పింది. రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వరకు బీమా వర్తిస్తుందని పేర్కొంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమా అందనుందని వెల్లడించింది.