గచ్చిబౌలి, వెలుగు: యాంకర్స్, హీరోయిన్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, కామెంట్స్ రాస్తున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్క్రైమ్పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజు(30) మూడేండ్ల పాటు దుబాయ్ లో ప్లంబర్ గా వర్క్ చేశాడు. తర్వాత సిటీకి వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలోజాబ్ చేస్తున్నాడు. ఫేక్ ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేసుకున్న వీర్రాజు అందులో టీవీ యాంకర్లు, సినిమా హీరోయిన్లకు చెందిన ఫొటోలను అప్లోడ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు.
దీనిపై ఈ నెల 17న యాంకర్ అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం వీర్రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.