ఆల్​టైమ్​ హై సమీపంలో ఇండెక్స్​లు

ఆల్​టైమ్​ హై సమీపంలో ఇండెక్స్​లు
  • బడ్జెట్​ బుల్​.. దూకుడే దూకుడు
  • రెండో రోజూ మార్కెట్లలో ర్యాలీ
  • మంగళవారం ఇన్వెస్టర్ల సంపద రూ. 4 లక్షల కోట్లు పెరిగింది

ముంబై: వరసగా రెండో రోజూ ర్యాలీ కొనసాగడంతో సెన్సెక్స్​, నిఫ్టీలు ఆల్​టైమ్​ హైకి దగ్గరగా చేరాయి. బడ్జెట్​ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటం స్టాక్​ మార్కెట్లలో కొత్త ఉత్సాహం నింపింది. గ్లోబల్​ ఈక్విటీ మార్కెట్లూ పాజిటివ్​గా కదలడం సెంటిమెంట్​ను పెంచింది. కార్పొరేట్​ ఎర్నింగ్స్​ బాగుంటే మార్కెట్లు మరింత పెరుగుతాయనే ఆశాభావం ఇప్పుడు నెలకొంది.

మంగళవారం సెన్సెక్స్​ 1,197 పాయింట్లు (2.46 శాతం) పెరిగి  49,798 వద్ద ముగిసింది. బడ్జెట్​ ముందు వారంలో నష్టాలన్నింటినీ సెన్సెక్స్​ గత రెండు రోజుల్లోనే రికవర్​ చేసుకోగలిగింది. మరోవైపు ఎన్​ఎస్​ఈ నిఫ్టీ కూడా 367 పాయింట్లు (2.57 శాతం) పెరిగి 14,648 పాయింట్లకు చేరింది.

బ్యాంకింగ్​, ఇన్​ఫ్రా, ఆటో సెక్టార్లలో ర్యాలీ కనిపిస్తోంది. కిందటి వారమంతా అమ్మకాలకు తెగబడిన ఎఫ్​పీఐలు తమ ట్రెండ్​ను రివర్స్​ చేశారు. త్వరలో యూఎస్​ కోవిడ్​ సపోర్ట్​ బిల్​ తేనుందనే వార్తలూ మార్కెట్​ పెరగడానికి సాయపడ్డాయి. ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్‌ 62 వేల పాయింట్లను టచ్‌ చేస్తుందని బ్రోకరేజి కంపెనీ మోతిలాల్ ఓస్వాల్‌ అంచనావేసింది. మంగళవారం సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపద 4.19 లక్షల కోట్లు పెరిగింది.

మార్కెట్లో ఏం జరిగింది…

ఇండిగో పెయింట్స్​ 20 శాతం అప్పర్​ సర్క్యూట్​ను తాకింది.  ఇష్యూ ధరతో పోలిస్తే 110 శాతం షేర్​ ప్రైస్​ పెరిగింది.

స్క్రాపేజ్​ పాలసీ, క్యూ3 రిజల్ట్స్​  నేపథ్యంలో టాటా మోటార్స్​ 17 శాతం ఎగిసింది.

ప్రాఫిట్​ బుకింగ్​తో టైటాన్​ 1 శాతం తగ్గింది.

బడ్జెట్​ ప్రకటనలతో సిమెంట్​, ఇన్​ఫ్రా షేర్లు ర్యాలీ చేశాయి.

మొత్తం 249 షేర్లు 52 వారాల హై రికార్డు చేశాయి. వీటిలో ఐటీసీ, గ్రాసిమ్​, ఎస్​బీఐ, సీమెన్స్​, టాటా మోటార్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, బాష్​లు ఉన్నాయి.

బ్లూచిప్స్​లో టాటా మోటార్స్​ షేరే ఎక్కువగా లాభపడింది.  శ్రీ సిమెంట్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎస్​బీఐ, యూపీఎల్​, గ్రాసిమ్​ ఇండస్ట్రీస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హిందాల్కో షేర్లు లాభాల్లో ముగిశాయి.

హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ ఇన్సూరెన్స్​ షేర్​ నిఫ్టీలో టాప్​ లూజర్​గా నిలిచింది. బజాజ్​ ఫిన్​సర్వ్​, హీరో మోటో కార్ప్​, హెచ్​యూఎల్​, ఎస్​బీఐ లైఫ్​, టైటాన్​, బ్రిటానియా ఇండస్ట్రీస్​ షేర్లు నష్టాలపాలయ్యాయి.

అశోక్​ లేలాండ్​, టీవీఎస్​ మోటార్​, జీ ఎంటర్​టెయిన్​మెంట్​, సెంచురీ టెక్స్​టైల్స్​, కేఈసీ ఇంటర్నేషనల్​, ఇండియన్​ బ్యాంకులు మిడ్​, స్మాల్​ క్యాప్​ ఇండెక్స్​లలో లాభపడ్డాయి. ఈ షేర్లు ఆరు నుంచి పది శాతం పెరిగాయి.

బలరాంపుర్​ చీనీ మిల్స్​, డీసీఎం శ్రీరామ్​, ఈఐడీ ప్యారీ, కోరమాండల్​ ఇంటర్నేషనల్​, వరుణ్​ బెవరేజెస్​, సెయిల్​ షేర్లు నష్టాలతో ముగిశాయి. ఓవరాల్​గా చూస్తే 1,755 షేర్లు లాభాల్లోనూ, 1,184 షేర్లు నష్టాలలోనూ ముగిశాయి. 335 షేర్లు అప్పర్​ సర్క్యూట్​ తాకగా, 277 షేర్లు లోయర్​ సర్క్యూట్​ను తాకాయి. యూరోపియన్​ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

For More News..

మా బండ్లలో డీజిల్ పోయిస్తే.. నీ బిడ్డను వెతుకుతం

ఆరుసార్లు జాక్‌‌‌‌పాట్‌‌‌‌ కొట్టిన అదృష్టవంతుడు

లైసెన్స్‌‌‌‌‌‌‌‌ లేని వాళ్లకు బండిస్తే రూ. 5 వేలు ఫైన్