పాయల్‌‌‌‌, నిశా, ఆకాంశకు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌

పాయల్‌‌‌‌, నిశా, ఆకాంశకు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా యంగ్‌‌‌‌ బాక్సర్లు పాయల్‌‌‌‌, నిశా, ఆకాంశ.. ఐబీఏ జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌తో మెరిశారు. అర్మేనియాలో మంగళవారం జరిగిన గర్ల్స్‌‌‌‌ 48 కేజీల ఫైనల్లో పాయల్‌‌‌‌ 5–0తో లోకల్‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ పెట్రోస్యన్ హెగైన్‌‌‌‌ (అర్మేనియా)పై గెలిచింది. 

52 కేజీల టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో నిశా 5–0తో అబ్దుల్లాయోవా ఫారినోజ్‌‌‌‌ (తజకిస్తాన్‌‌‌‌)పై, 70 కేజీల్లో ఆకాంశ5–0తో తైమజోవా ఎలిజవేటా (రష్యా)పై గెలిచి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచారు. వినీ (57 కేజీ), శ్రుతి (63 కేజీ), మేఘా (80 కేజీ) సిల్వర్‌‌‌‌ మెడల్స్‌‌‌‌తో సరిపెట్టుకున్నారు. 

మెన్స్‌‌‌‌ కేటగిరీలో సాహిల్‌‌‌‌ (75 కేజీ), హేమంత్‌‌‌‌ (80+ కేజీ) కూడా సిల్వర్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను సాధించారు. ఓవరాల్‌‌‌‌గా ఈ టోర్నీలో ఇండియా 3 గోల్డ్‌‌‌‌, 9 సిల్వర్‌‌‌‌, 5 బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను గెలుచుకుంది.