రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన ఇండియా డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు

రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన ఇండియా డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు

న్యూఢిల్లీ: డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో మేటి క్రికెటర్లుగా పేరుతెచ్చుకున్న ఐదుగురు ఆటగాళ్లు తమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన బెంగాల్ లెజెండ్ మనోజ్ తివారీ, జార్ఖండ్ బిగ్ హిట్టర్ సౌరభ్ తివారీ, అదే రాష్ట్రానికి చెందిన పేసర్ వరుణ్ ఆరోన్​, ముంబై స్టార్ ధవళ్ కులకర్ణి, విదర్భ రంజీ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ ఫయాజ్ ఫజల్ ఆటకు గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పారు. ఈ ఐదుగురికి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌, టీమిండియా కాంట్రాక్ట్ లేదు. దాంతో రాజకీయాలు సహా ఇతర మార్గాల్లో ముందుకెళ్లేందుకు క్రికెట్‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు పలికారు. ఆరోన్‌‌‌‌‌‌‌‌, మనోజ్, ఫయాజ్ తమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలెట్టిన స్టేడియంలోనే ముగింపు పలకడం విశేషం.