నగరంలో ఇండియా ఈబీ-5 పాస్‌పోర్ట్‌‌ రోడ్​ షో

నగరంలో ఇండియా ఈబీ-5 పాస్‌పోర్ట్‌‌ రోడ్​ షో

హైదరాబాద్, వెలుగు: ఇన్వెస్ట్ ఇన్‌ యూఎస్ఏ (ఐఐయూఎస్ఏ), పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీడీసీసీఐ) 'ఇండియా ఈబీ–5 పాస్‌పోర్ట్‌‌ రోడ్​ షో‌ సిరీస్' ను హైదరాబాద్​లో మొదలుపెట్టాయి. ఐఐయూఎస్ఏ డైరెక్టర్ ఆఫ్ ఈవెంట్స్ మయాంక్ చత్వాల్ మంగళవారం దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పాస్‌పోర్ట్ సిరీస్ రెండో ఎడిషన్‌ అన్నారు.  ఈబీ–5 పెట్టుబడులపై ఇది దృష్టి సారిస్తుందని చెప్పారు.    భారతీయ పెట్టుబడిదారులకు యునైటెడ్ స్టేట్స్​లో అవకాశాల గురించి విలువైన సమాచారం అందిస్తామని చెప్పారు. అమెరికాకు వలసకు వెళ్లడానికి చాలా మంది ఇండస్ట్రియలిస్టులు  ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇదే వేదికగా నెట్‌వర్కింగ్ అవకాశాలనూ పొందవచ్చని చెప్పారు.  కనీసం 9,00,000 డాలర్లను ఇన్వెస్ట్​ చేసిన వారికి అమెరికా ఈబీ–5 వీసా ఇస్తుంది.