
హైదరాబాద్, వెలుగు: ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ఏ (ఐఐయూఎస్ఏ), పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్డీడీసీసీఐ) 'ఇండియా ఈబీ–5 పాస్పోర్ట్ రోడ్ షో సిరీస్' ను హైదరాబాద్లో మొదలుపెట్టాయి. ఐఐయూఎస్ఏ డైరెక్టర్ ఆఫ్ ఈవెంట్స్ మయాంక్ చత్వాల్ మంగళవారం దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పాస్పోర్ట్ సిరీస్ రెండో ఎడిషన్ అన్నారు. ఈబీ–5 పెట్టుబడులపై ఇది దృష్టి సారిస్తుందని చెప్పారు. భారతీయ పెట్టుబడిదారులకు యునైటెడ్ స్టేట్స్లో అవకాశాల గురించి విలువైన సమాచారం అందిస్తామని చెప్పారు. అమెరికాకు వలసకు వెళ్లడానికి చాలా మంది ఇండస్ట్రియలిస్టులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇదే వేదికగా నెట్వర్కింగ్ అవకాశాలనూ పొందవచ్చని చెప్పారు. కనీసం 9,00,000 డాలర్లను ఇన్వెస్ట్ చేసిన వారికి అమెరికా ఈబీ–5 వీసా ఇస్తుంది.