ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఇంగ్లండ్ మ్యాచ్ సూపర్ హిట్ అయింది. తొలి రోజు నుంచే భారీ సంఖ్యలో అభిమానులు హాజరై ఆటను ఆస్వాదించారు. మొత్తంగా నాలుగు రోజుల్లో లక్షా 10 వేల మంది స్టేడియానికి వచ్చారు. ఆదివారం 29,368 మంది ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్ను వీక్షించారు. చివరి రోజు ఉత్కంఠగా సాగిన ఆటను బాగా ఎంజాయ్ చేశారు. ఇండియా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఫ్యాన్స్ కమాన్ ఇండియా, జై శ్రీరాం నినాదాలు చేస్తూ ప్లేయర్లను ఉత్సాహపరిచారు. చివరకు ఇండియా ఓడిపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. ఇంగ్లండ్ అభిమానులు జోష్ చేశారు.
– హైదరాబాద్, వెలుగు