డబ్ల్యూటీసీలో ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయిన ఇండియా

డబ్ల్యూటీసీలో ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయిన ఇండియా

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టులో అనూహ్యంగా ఓడిపోయిన టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కిందకు పడిపోయింది. పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనక్కువెళ్లిపోయింది. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకున్న  రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరింది.

కానీ, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆస్ట్రేలియా నెగ్గడంతో రెండో స్థానానికి పడిపోయింది. తాజాగా  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 28 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడంతో ఇండియా 43.33 పర్సెంటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో ఐదో స్థానానికి  దిగజారింది. బంగ్లాదేశ్ 40 పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఆస్ట్రేలియా (55), సౌతాఫ్రికా (50), న్యూజిలాండ్ (50) టాప్ 3లో నిలిచాయి.