న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్క్రాపేజీ పాలసీని కేంద్రం ప్రకటించింది. పాత, కాలుష్యకారక వెహికల్స్ను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని వాలంటరీగా అమలు చేస్తారు. ఓనర్కు ఇష్టమైతేనే పాత వెహికల్ను వదులుకోవచ్చు. పర్సనల్ వెహికల్స్కు 20 ఏళ్ల తర్వాత, కమర్షియల్వెహికల్స్కు 15 ఏళ్ల తరువాత ఫిట్నెస్ టెస్ట్చేస్తారు. వెహికల్ బాగా లేకుంటే స్క్రాప్గా మారుస్తారు. బడ్జెట్లో దీనిపై ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ఆ ప్రసంగం ముగిశాక కేంద్ర ట్రాన్స్పోర్ట్ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ కోటి లైట్, మీడియం, హెవీ మోటార్ వెహికల్స్కు స్క్రాపేజ్ పాలసీ వర్తిస్తుందని, త్వరలోనే పూర్తి సమాచారం ఇస్తామని చెప్పారు.
స్క్రాపేజీ పాలసీ అంటే…
ఎలక్ట్రిక్ వెహికల్స్ను ఎంకరేజ్చేయడానికి మోటార్ వెహికల్ చట్టంలో మార్పులు చేయాలని 2019లో కేంద్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక పాలసీని తయారు చేసింది.15 ఏళ్లకు పైబడిన వెహికల్స్ను తుక్కుగా మార్చడం, ఆటో ఇండస్ట్రీకి బూస్ట్ ఇవ్వాలనేది దీని ఉద్దేశం. ఈ విధానంలో పాత వెహికల్ను వదులుకున్న వారికి ఇన్సెంటివ్స్. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు, వెహికిల్ రేటుపై ఒకశాతం డిస్కౌంట్ వంటి మినహాయింపులు ఉంటాయి. ఈ పాలసీ అమలు కోసం కేంద్ర రవాణా శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం 15ఏండ్లు నిండినవాహనాలకు రీ–రిజిస్ట్రేషన్ చేయించుకుని నడిపిస్తున్నారు . ఇలా 30–40 ఏండ్ల వరకు నడుస్తున్నాయి. కొత్త విధానంతో దీనికి పుల్ స్టాప్ పడుతుంది. ప్రస్తుతం దేశంలో 20 ఏళ్లు నిండిన లైట్ మోటార్ వెహికల్స్ 51లక్షలు, పదిహేనేళ్లు నిండినవి 34 లక్షలు, పదిహేనేళ్లు నిండిన హెవీ మోటార్ వెహికల్స్ 17 లక్షలు ఉన్నాయి. వీటికి ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేవు కాబట్టి తుక్కుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఫిట్నెట్ టెస్టు ఫెయిలైతే గ్రీన్ట్యాక్స్ వేస్తామని కేంద్ర ప్రభుత్వం గత నెల ప్రకటించింది. రోడ్ ట్యాక్స్లో 25 శాతం వరకు గ్రీన్ట్యాక్స్ ఉంటుందని తెలిపింది. సీఎన్జీ, ఎల్పీజీ వంటి వెహికిల్స్కు దీని నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పింది.
ఇవీ లాభాలు
- స్క్రాపేజీ పాలసీతో ఇండియాను ఆటోమొబైల్ హబ్ చేయొచ్చని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. పాత వెహికల్స్ విడిభాగాలను కొత్త వాటి తయారీకి వాడుకోవచ్చు.
ఫలితంగా ప్రొడ్యూసింగ్ కాస్ట్ తగ్గుతుంది. - పాత వెహికల్స్ రోడ్లపైకి రాకపోవడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. రోడ్సేఫ్టీ పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఫారిన్ కరెన్సీ ఆదా అవుతుంది.
- ఈ పాలసీతో కొత్త వెహికల్స్ అమ్మకాలు పెరిగే చాన్సులు ఉంటాయి కాబట్టి మరిన్ని కంపెనీలు ఇండియాలో ప్లాంట్లు పెట్టడానికి ముందుకు వస్తాయి.
- ఆటో సెక్టార్లోకి దాదాపు రూ.10 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని అంచనా. 50 వేల మందికి జాబ్స్ దొరుకుతాయని
మంత్రి గడ్కరీ అన్నారు. - ప్రస్తుతం ఇండియా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏడాది టర్నోవర్ రూ.4.5 లక్షల కోట్లు కాగా, స్క్రాపేజ్ పాలసీ అమల్లోకి వస్తే రూ.ఆరు లక్షల కోట్లకు పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

