భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం సిగరెట్ ప్రేమికులను గాయపరిచింది. అదేంటంటారా.. రూ.20 లోపు ధర కలిగిన చైనా లైటర్లపై ఇండియా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతులు అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. లైటర్లపై దిగుమతి సుంకాన్ని ఉచితం నుంచి తొలగించి 'బ్యాన్' కేటగిరీలో ఉంచారు. లైటర్సీఐఎఫ్(ధర, ఇన్సూరెన్స్, సరకు రవాణా) రూ.20 కంటే ఎక్కువ ఉంటే నే ఆ లైటర్లను ఇండియాలో దిగుమతి చేసుకోవచ్చు.
సీఐఎఫ్ అంటే..
సీఐఎఫ్ అంటే కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రేట్ అని అర్థం. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల ధర నిర్ణయించడానికి ఉపయోగపడే బిజినెస్ వర్డ్ ఇది. రీఫిల్, నాన్ రీఫిల్, గ్యాస్, పాకెట్ లైటర్లపై గతంలోనే నిషేధం విధించారు. వీటి దిగుమతుల విలువ 2022–23 సంవత్సరానికి 6.6 మిలియన్ డాలర్లు ఉండగా.. 2023 ఏప్రిల్లో 1.3 మిలియన్ డాలర్లకు చేరింది. ఇండియానే కాకుండా స్పెయిన్, టర్కియే, యూఏఈ తదితర దేశాలు వీటిని దిగుమతి చేసుకునే లిస్టులో ఉండేవి.
నాన్రీఫిల్లబుల్ లైటర్లు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తాయని, ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుందని వాటిని బ్యాన్ చేయాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ గతంలోనే అన్నారు. భారత్లో అగ్గిపెట్టెల తయారీ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. లైటర్ల రాకతో వాళ్ల బిజినెస్ దెబ్బతింది. వాటిని నిషేధిస్తే అగ్గిపెట్టెల తయారీ ఇండస్ట్రీకి ఊతం ఇచ్చినట్లు అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.